ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను 5 రోజుల పాటు నిర్వహించనున్నారు. అసెంబ్లీ సెషన్ టీ బ్రేక్ సందర్భంగా నిర్వహించిన బీఏసీ సమావేశంలో స్పికర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. స్పికర్ తమ్మినేని ఆధ్వర్యంలో అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశంలో సీఎం జగన్ తో సహా మంత్రులు బుగ్గన, కన్నబాబు, అనిల్ హాజరయ్యారు. అలాగే ప్రతిపక్ష పార్టీ టీడీపీ తరుపున అచ్చెనాయుడు హాజరయ్యాడు. అయితే ప్రతిపక్షా పార్టి అధినాయకుడు అయిన చంద్రబాబు ఈ సమావేశానికి డుమ్మా కోట్టాడు.
ఇక ఈ బీఏసీ సమావేశంలో ప్రతిపక్ష పార్టీ , అసెంబ్లీ సమావేశాలను 10 రోజుల పాటు నిర్వహించాలని కొరింది.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారని అధికార పక్షం తెలిపింది. అంతేగాక సభలో 70 ఏళ్లకు పైగా ఉన్నవారు కూడా ఉన్నారని జగన్ సర్కార్ గుర్తుచేసింది. దీంతో జగన్ సర్కార్ టీడీపీ ఆశలపై నీళ్లు జల్లుతూ , ఏపీ అసెంబ్లీ సమావేశాలను 5 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ అసెంబ్లీ సమావేశాలలో 21 ఎజెండా అంశాలను జగన్ సర్కార్ ప్రతిపాదించింది. అయితే వాటిలో 19 బిల్లులు మాత్రమే ప్రవేశపెట్టాలని బీఏసీ సమావేశంలో నాయకులు నిర్ణయం తీసుకున్నా