15 రోజులుగా సందడిగా సాగిన ప్రచారానికి తెరపడి కీలక అంకానికి తెరలేచింది. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దమైంది.మరి కొన్ని గంటల్లో పోలింగ్ మొదలు కానుంది.ప్రదాన పార్టీల నాయకులు ఎవరికివారు గెలుపు పై ధీమాతో ఉన్నారు.ఈరోజు బి‌జే‌పి కార్యకర్తలు ఈసీ కార్యలయం ముందు చెప్పటిన దర్నపై మంత్రి హరీష్ రావు స్పందించారు.

బి‌జే‌పి వాళ్ళు ఇంతవరకు ఆడింది,ఆడుతున్నది అంతా పెద్ద డ్రామా అని మంత్రి హరీష్ రావు పటాన్ చెరు లో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం బి‌జే‌పి నాయకులు 12 మంది,మోడి గారితో సహ తరలి రావడం విడ్డూరంగా ఉందని అన్నారు.

బి‌జే‌పి వాళ్ళు ఓట్లు వస్తాయన్నా ఆశతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏదో ఎన్నికల ముందు హడావిడి చెయ్యడానికి బి‌జే‌పి వాళ్ళు ఎన్నికల సంఘం కార్యలయం ముందు డ్రామా చేపట్టారన్నారు.ప్రజలు అంతా గమనిస్తున్నారని,ప్రజలు ఎన్నికల్లో బి‌జే‌పి పార్టీకి ఖచ్చితంగా బుద్ది చెప్తారాని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: