మొత్తానికి పోలింగునకు గడువు దగ్గరపడుతున్నా కూడా ఓటరు నాడి మాత్రం అంతు చిక్కడంలేదుట. ఎవరికి వారు ధీమాగా ఉన్నా కూడా కూడా ప్రజా తీర్పు ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఒకరా ఇద్దరా ఎనభై లక్షల మంది జనం ఇచ్చే తీర్పు ఇది. అందుకే ఇది అతి పెద్ద సమరం అయింది. సౌత్ లో అతి పెద్ద సిటీగా లక్షలాది మందికి సౌభాగ్యనగరంగా ఉన్న హైదారాబాద్ తన భాగ్య విధాత ఎవరో తేల్చుకోవడానికి కొద్ది గంటలు మాత్రమే వ్యవధి ఉంది.
అయితే ఈసారి మాత్రం చాలా భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరేంటి అన్నది జనం దగ్గర మొత్తం జాతకం ఉంది. ఒక ఓటు అనే ఆయుధంతో వారు గట్టిగానే సౌండ్ చేయనున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో జనం తీర్పు కఠినంగా ఉంటుందా ఉంటే ఎవరికి అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికి చాలా ఎన్నికలను అంతా చూశారు. తాయిలాలూ రాయితీలు ఇవన్నీ కూడా ఇపుడు షరా మామూలు అయిపోయాయి. ఏ ఎన్నికకు ఆ ఎన్నికగా ఓటరన్న తెలివి మీరుతున్నాడు. కీలెరిగి వాత పెడుతున్నాడు. దాంతో ఈసారి ఎన్నికల్లో ఎన్ని చిత్రాలు చూపిస్తాడో అన్న గుబులు అయితే అందరిలో ఉంది. అందుకే ఈ ఒక్కరాత్రి గడవనీ అనుకుంటున్నారుట. నరాలు తెగే టెన్షన్ లో నేతాశ్రీలు ఉన్నారట.