ఈ అంశాలకు సంబందించి కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు.గ్రేటర్ ఎన్నికల కోసం బిజేపి నాయకులు అంతా మంది ప్రచారానికి రావడం ఆశ్చర్యంగా వుందన్నారు.బిజేపి నేతలు హైదరబాద్ పేరు మారుస్తాం అనడం కరెక్ట్ కాదన్నారు.హైదరబాద్ ను అభివృద్ది చెయ్యకున్న ప్రచారం చేసుకోవచ్చని అన్నదమ్ములైన మోడి,అమిత్ షా లు నిరూపించారంటూ ఎద్దేవా చేశారు.
బిజేపి పార్టీ ముస్లింలను చులకనగా చూడటం మానెయ్యలని హెచ్చరించారు.ముస్లింల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 2014 లో పలు కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. టిఆర్ఎస్,ఎంఐఎం పార్టీలు కలిసి కాంగ్రెస్ ను బలహీన పరచడం వల్లే బిజేపి ఎదిగిందన్నారు.తెలంగాణలో బిజేపి ఎదగడానికి ప్రదాన కారణం టిఆర్ఎస్ పార్టీ కారణం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. .