ఎన్నికలు అయిన తర్వాత పరిణామాలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి టి.ఆర్.యస్ నాయకులు ఎమ్మెల్సీ శ్రీ నివాస్ రెడ్డి, లిగల్ సెల్ భరత్ కుమార్ కీలక ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ భరత్ కుమార్ మాట్లాడుతూ... ఓ టివి ఛానెల్ బీజేపీ ప్రచారకర్తగా మారింది. దీనిపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాం అని ఆయన వెల్లడించారు. రేపు ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ సూచించింది అని ఆయన పేర్కొన్నారు.
ఇల్లీగల్ గా బీజేపీ ప్రచారం చేస్తోంది అన్నారు. ఒక పార్టీని టార్గెట్ గా చేసి కథనాలు ప్రసారం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. కొంతమందికి పైసలు ఇచ్చి మాట్లాడిస్తూ.. తిట్టిపిస్తున్నారు అని ఆయన అన్నారు. హద్దు పద్దు లేకుండా మాట్లాడుతున్నారు అని విమర్శించారు. బిజెపికి మాట్లాడే అర్హత లేదు అన్నారు. ఈ కథనాల వెనుక ఎవరు ఉన్నారో బయటకు వచ్చేలా చేయాలని ఆయన డిమాండ్ చేసారు. ప్రయివేటు ఛానెల్ పై ఎస్ఈసి చర్యలు తీసుకోవాలన్నారు. మాయ మాటలు, మాయదారి పనులు, మోసం చేయడం బీజేపీకే తెలుసు అని ఆయన విమర్శించారు.