ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న  కరోనా వైరస్ కి ఎట్టకేలకు మరికొన్ని నెలలలో వ్యాక్సిన్ రాబోతుంది..ఇందుకు సంబంధించిన  క్లినికల్ ట్రయల్స్  నీ  కూడా పలు దేశాలు చేపడుతున్నాయి ..అయితే కరొనకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఆర్ట్ ఆఫ్ లివింగ్  వ్యవస్థాపకులు తెలిపారు.. అదేంటంటే  శ్రీశ్రీ  రవిశంకర్ గారు  కరోనా పై ఆయుర్వేదం బాగా పని చేస్తుందని అన్నారు..ఆయుర్వేద ఔషదాలతో  కరోనా ని పూర్తిగా పోగొట్టుకోవచ్చు అని ఈ సందర్భంగా  తెలిపారు ..

జర్మనీకి చెందిన ఫ్రాంక్‌ఫర్ట్  బయోటెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్లో ఈ విషయంపై నిర్ధారణ కూడా అయ్యిందని అన్నారు.. ఆయుర్వేదంతో కరోనా ని సమర్థవంతంగా జయించవచ్చు అని సోమవారం జరిగిన విర్చువల్  సమావేశంలో శ్రీశ్రీ రవిశంకర్ పేర్కొన్నారు.. ఈ సందర్భంగా తమ సంస్థ శ్రీశ్రీ తత్వ తయారుచేసిన ఆయుర్వేద  ఔషధాలు కరోనా నుండి మిమ్మల్ని రక్షిస్తాయని తెలిపారు ..ఆయుర్వేద ఔషధాలతో పాటు సహజ సిద్ధంగా  తయారు చేసిన  కబసూర్ కుడినీర్ మాత్రలు ఇవ్వనున్నారు ..ఈ మాత్రలు మానవ శరీరంలోకి కరోనా వైరస్ రాకుండా అడ్డుకున్నాయని  తెలిపారు ..

తమ సంస్థ శ్రీశ్రీ తత్వ  తయారుచేసిన ఔషధలను ఢిల్లీలోని పేదవారికి  ఉచితంగా అందజేస్తామని అన్నారు ..అయితే ఈ ఔషధ మాత్రల క్లినికల్ ట్రయల్స్ ని బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్లో నిర్వహించామని అన్నారు.. అయితే  బెంగుళూరులోని హాస్పిటల్లో స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న రోగులపై వీటిని ప్రయోగించామని  ప్రయోగించిన రోగులలో ఎటువంటి దుష్పరిణామాలు సంభవించలేదని అయన  తెలియజేశారు..ఈ సమావేశంలో జర్మనీకి  చెందిన స్టాన్ ఫోర్డ్  బయోటెక్నాలజీ ఎండి  డాక్టర్ క్రిస్టియన్ గార్బే మరియు  శ్రీశ్రీ తత్వ ఎండి అరవింద్ వర్చశ్వీ  పాల్గొన్నారు ...

అయితే పలు దేశాలు  కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న వేళా మన దేశం లో ఆయుర్వేద మాత్రల  ద్వారా కరోనా ని  సమర్థవంతగా పారద్రోలేల చేయడం నిజంగా శుభపరిణామం .. అతి తొందరలో ఈ ఔషధ మాత్రలు అందుబాటులోకి రావాలని కోరుకుందాము ..అయితే కరోనా వాక్సిన్ ని  డిసెంబర్ నెలలో అందుబాటులోకి తీసుకొస్తామని భారత్ బయోటెక్ చెబుతుంది .. చూడాలి మరి ఏది ముందు రాబోతుంది అని .. ఒకవేళ వాక్సిన్ ధర ఎక్కువ రేటు ఉంటే ప్రజలు శ్రీశ్రీ  రవిశంకర్ గారి సంస్థ తయారు చేసిన ఔషధ మాత్రలను తీసుకునేందుకు మొగ్గు చూపుతారు ..  


మరింత సమాచారం తెలుసుకోండి: