ఇదిలా వుంటే ఎంఐఎం-బీజేపీ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు ఎంతటి దుమరాన్ని రేపయో తెలిసిందే. బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ తాము గెలిస్తే పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామనడం,దానికి కౌంటర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాజీ ప్రధాని పీవీ, ఎన్టీఆర్ ఘాట్స్ను కూల్చివేస్తామని అనడం పెను దుమారన్నే రేపాయి.ఇక బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్య్వూలో పలు వ్యాఖ్యలు చేశారు.
పాత బస్తీలో రొహింగ్యాలు, పాకిస్తానీ ఓటర్లు, అక్రమ వలసదారులు ఉన్నారని వచ్చిన ఆరోపణలు అబద్దమన్నారు.పాతబస్తీ హైదరబాద్ లో భాగమే అని తెలిపారు. బిజేపి నేతలు పాతబస్తిని శత్రు దేశంలా భావిస్తున్నరన్నారు.ఈ ఎన్నికల్లో అన్నీ పార్టీలు కూడా తమనే టార్గెట్ చేస్తున్నాయని నేను లైలా లాంటి వాడినైతే మిగతా వారంతా మజ్నూలా నా వెంట పడుతున్నారు.’ అంటూ చమత్కరించారు.