అయితే తెలంగాణ మాదిరిగానే బీజేపీ పార్టీ ఏపీ లో బలపడాలని చూస్తుంది.. ఇప్పటికే టీడీపీ పార్టీ ను సమూలంగా తుడిచిపెట్టుకుపోయేలా చేయడంలో వైసీపీ తో పాటు బీజేపీ కూడా ఓ చేయి వేసింది.. దాంతో బీజేపీ తప్ప వేరే ఏ పార్టీ కి ఏపీ లో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.. అయితే ఈ తిరుపతి ఎన్నికల్లో వైసీపీ కి కూడా ఝలక్ ఇవ్వాలని బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుంది.. నిజానికి ఉప ఎన్నికల విషయంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే చాలా వరకు జాగ్రత్తగానే వ్యవహరిస్తూ ఉంటుంది. విపక్షాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఉపఎన్నిక గెలవాలని అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా భావిస్తుంది.
రాజకీయంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తూ విపక్షాల పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలని చూడటం సర్వసాధారణం. అయితే తిరుపతి ఉప ఎన్నికల విషయంలో వైసీపీ వైఖరి మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ఉంది అనే చెప్పాలి. గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారీ మెజారిటీతో ఎంపీ స్థానాన్ని గెలిచినా వైకాపా ఈసారి మెజారిటీ పెంచుకోవటం పక్కన పడితే, విజయం సాధించటానికి తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అభిప్రాయాడుతున్నారు. అందుకు కారణం ఇక్కడ ప్రజల్లో వైసీపీ పట్ల కొంత వ్యతిరేకత ఉందట.. దానికి తోడు టీడీపీ కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో బీజేపీ ఓటర్లకు ప్రత్యామ్నాయ పార్టీ గా కనిపిస్తుంది.