అయితే ఆంధ్రప్రదేశ్ లో కరోనా రికవరీ రేట్ బాగా పెరిగింది .. ఈరోజు కరోనా నుండి 934 మంది కోలుకున్నారు .. దీనితో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య ఎనిమిది లక్షల యాభై మూడు వేలకి చేరింది .. కొన్ని రోజుల నుండి కరోనా కేసులు దారుణంగా పడిపోతున్నాయి .. కరోనా సెకండ్ వేవ్ అంటూ కేంద్రం భయపెట్టిన మన రెండు తెలుగు రాష్ట్రాలలో వైరస్ ప్రభావం అంత ఏమి కనిపించడం లేదు .. రోజురోజుకు కరోనా కేసులు తక్కువగానే వస్తున్నాయి ..ఇవి ఇలాగే తగ్గుతూ ఉంటె కరోనా కేసులు రాని రాష్ట్రాలుగా మనం నిలువవచ్చు ...
మరోపక్క దేశ వ్యాప్తంగా కూడా కరోనా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తుంది .. గడిచిన 24 గంటల్లో దేశం మొత్తం లో 38 వేల పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి .. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 94,31,691కి చేరింది.. ఇందులో 88,47,000 మంది కోలుకోగా ప్రస్తుతం దేశం లో 4,46,952 మంది చికిత్స పొందుతున్నారు ..