తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఒకపక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కు అంతా రంగం సిద్ధమైన తరుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే నాగార్జున సాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూశారు. తెల్లవారు జామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తుదిశ్వాస విడిచారు. నోముల నర్సింహయ్య మృతితో అతని కుటుంబసభ్యులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు.ఇక ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో పలువురు అధికార టీఆర్ఎస్ నేతలు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా ఇటీవలే దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అలాగే మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిల మరణం అధికార టీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నోముల నర్సింహయ్య కూడా కన్నుమూయడంతో టీఆర్ఎస్ నేతలు తీవ్ర దిగ్బ్రాంతిలో ఉన్నారు.





ఇక ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య 1956 జనవరి 9న ఉమ్మడి నల్గొండ జిల్లా, నకిరేకల్ మండలం, పాలెం గ్రామంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చేశారు. కమ్యునిస్టు భావాలతో అడుగులు వేశారు.. ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేశారు. ఆ తర్వాత సీపీఐలో చేరారు.. అలాగే లాయర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత నకిరేకల్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నకిరేకల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. 1999 నుంచి 2009 వరకు అసెంబ్లీలో సీపీఐ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. కానీ రాష్ట్ర విభజన సమయంలో సీపీఐతో విభేదించి 2013లో కెసిఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఇక అప్పుడు జరిగిన ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. మరలా 2018లో జరిగిన ఎలక్షన్లలో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: