గ్రేటర్ ఎన్నికల పోలింగ్ మొదలైంది.పోలింగ్ ప్రశాంతంగా సజావుగా జరుగుతుందని అధికారులు వెల్లడించారు.ఐతే అధికారులు పాతబస్తీ పైన ప్రతెక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.ఎందుకంటే అక్కడ మొత్తం 590 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 387 ఉన్నాయి.

దీంతోఅదనపు బలగాలను రంగంలోకి దించారు అదికారులు.కొన్ని చోట్ల ఏకంగా పోలీస్ స్టేషన్ల పరిధిలోనే ఎన్నికలు జరుపుతుండడం గమనార్హం.గత ఎన్నికల్లో జరిగిన సంఘటలు మళ్ళీ రిపీట్ కాకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులువెల్లడించారు.

గతంలో పురానాపూల్, శాలిబండ ఏరియాల్లో ఉద్రిక్తతలు,ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి విధితమే. అలాంటి చర్యలు మళ్ళీ  పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: