గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నరసాపురం నియోజకవర్గానికి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన రఘురామ కృష్ణంరాజు, తరువాత కాలంలో ఏర్పడిన కొన్ని పొరపచ్చాల కారణంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో సొంత వైఎస్ఆర్ పార్టీలోని వ్యక్తులపైనే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ మోహన్ రెడ్డి మరియు ఎంపీ విజయ సాయి రెడ్డిలను కూడా కొన్ని సందర్భాల్లో విమర్శించి ఒక్కసారిగా వైసీపీ రెబెల్ ఎంపీగా ముద్ర పడ్డారు. కాగా ఇటీవలే ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొంత అస్వస్థతకు గురి అయిన సంగతి తెలిసిందే. ఆ అనారోగ్య సమస్య నిమిత్తం ఇటీవలే రఘురామ కృష్ణంరాజుకు బైపాస్ సర్జరీ చేశారు.







ఆ నిర్వహించిన బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో గుండెకు సంబంధించిన సర్జరీ జరిగింది. శస్త్రచికిత్స విజయవంతమైంది కానీ మరో రెండు రోజులు ఐసీయూలో ఉండాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. కాస్త కోలుకున్న తర్వాత ఆస్పత్రిలోని సాధారణ గదికి షిఫ్ట్ చేయనున్నారు. పూర్తి చికిత్స పొంది రెట్టింపు ఉత్సాహంతో దినచర్యలు ప్రారంభిస్తారని ఎంపీ రఘురామ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులు, మిత్రులు, సన్నిహితులకు ఆయన కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, సొంత వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ రఘురామ గళం విప్పుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే గత రెండు, మూడు రోజులుగా రఘురామ మీడియా సమావేశం నిర్వహించడం లేదు. అలాగే ఈ నెల 28న అమరావతికి సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో సైతం ఎంపీ రఘురామ కాస్త అనారోగ్యంగా ఉన్నట్లు కనిపించింది. ఈ తరుణంలో సోమవారం ఆయనకు సర్జరీ జరిగిందని, విజయవంతంగా పూర్తయిందని కుటుంబ సభ్యులు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: