రైతుల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. మంగళవారం తో ఆరవ రోజుకు చేరుకుంది. తమ డిమాండులు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను రత్తు చేయాలని ఆందోళన చేరుస్తున్నారు. సోమవారం బీజేపీ జాతీయ అధ్యకుడు ఇంట్లో మంత్రులు సమావేశం అయ్యారు. రైతుల ఆందోళన ఉదృతం అవుతున్న నేపథ్యంలో మంగళవారం చర్చలు జరగనున్నాయి.



వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేతకంగా పంజాబ్ సహా పలు రాష్ట్రాల రైతు సంఘాలు చేపట్టిన 'ఢిల్లీ ఛలో' నిరసన మార్చ్ కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన మంగళవారం ఆరవ రోజుకు చేరింది. కేంద్రం విజ్ఞప్తికి చలించకుండా రైతులు తమ డిమాండ్లు వినేంతవరకూ ఆందోళన కొనసాగించేందుకు పట్టుదలగా ఉన్నారు. దీంతో చర్చల విషయంలో ప్రతిష్టంభన తలెత్తింది. అయితే, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు రైతులను చర్చలకు ఆహ్వానించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర  సింగ్ తోమర్ సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. దీనికి ముందు ఈనెల 3వ తేదీన సమావేశం తేదీని మంత్రి ఖరారు చేశారు.



'డిసెంబర్ 3న సమావేశం జరపాలని గత నవంబర్ 13న నిర్ణయం తీసుకున్నాం. అయితే రైతులు ఆందోళన వైపే మొగ్గుచూపుతున్నారు. ఆ కారణంగా రైతు ప్రతినిధులతో డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో సమావేశం జరపాలని నిర్ణయించాం. చలి వాతావరణంతో పాటు కరోనా వైరస్ కూడా ఉంది. దయచేసి నిరసనలకు స్వస్తి చెప్పండి. చర్చల ద్వారా ఒక పరిష్కారం కనుగొందాం' అని నరేంద్ర సింగ్ తోమర్ రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: