ఏపీలో మళ్ళీ రంగుల రాజకీయం మొదలైంది. సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ముద్ర ఉండేలా చూసుకుంటారు. గతంలో అధికారంలో టీడీపీ ప్రభుత్వం అదే విధంగా చేసింది. రాష్ట్రంలో పసుపు కలర్ ఎక్కువగా కనిపించేలా చేసింది. ప్రతి పథకం, ప్రతి నిర్మాణంపై టీడీపీ ముద్ర ఉండేలా చూసుకుంది. ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ కూడా టీడీపీ కంటే ఎక్కువగానే తన ముద్ర ఉండేలా చూసుకుంది.

అందుకే ప్రతి గ్రామ సచివాలయానికి పార్టీ కలర్ వేసింది. ఇక గ్రామ సచివాలయమే కాకుండా వాటర్ ట్యాంకులు, స్కూల్స్, గోడలు, స్తంభాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నిర్మాణాలకు వైసీపీ రంగులు కనిపించాయి. ఇక ఇక్కడే ఆశల రగడ మొదలైంది. టీడీపీ హయాంలో పలు వాటికి పసుపు రంగు ఉన్నా సరే ఏం మాట్లాడని కొందరు పెద్దలు, వైసీపీ రంగులపై విమర్శలు చేశారు. అలాగే కొందరు టీడీపీకి చెందిన వారు దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు.

కోర్టు సైతం ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం సరికాదని, వెంటనే తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు కొన్నిరోజులు జరిగాక, ప్రభుత్వం రంగులని తొలగించి తెలుపు రంగు వేసింది. అయితే ఇంతటితో సమస్య క్లోజ్ అయిందట...కాలేదు. మరొకసారి ఈ రంగుల అంశంపై కోర్టుకు వెళ్లారు. ఇక ఇక్కడొక ట్విస్ట్ ఉంది. రంగులేసి తొలగించినందుకు రూ.4 వేల కోట్లయ్యాయని, వీటిని రాబట్టాలని పిటిషనర్ కోరారు. ఈ రూ.4 వేల కోట్లను ఖజానాకు జమ చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణలను వ్యక్తిగతంగా ప్రతివాదులుగా చేర్చి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గనుక కోర్టు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే మళ్ళీ తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. మరి చూడాలి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: