ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...అసలుకే  ప్రజలు ఎన్నికలలో పాల్గొనడం చాలా అరుదు అలాంటిది , లాక్ డౌన్ సమయం రావడం వల్ల ప్రజలు ఇంకా  బద్దకస్తులు  అయ్యారు, ఏం ఓటేస్తాంలే అని నిర్లక్ష్యంగానే వ్యవహరించారు.ఎందరో  ప్రముఖులు ముందుకి వచ్చి  ప్రజల్లో చైతన్యం నింపడానికి  చాలా సూచనలు చెప్పారు. ఎన్నో నినాదాలు, ఎందరో సెలబ్రిటీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు గత కొన్నిరోజులుగా ఓటు వేయండి అంటూ మొత్తుకుంటున్నారు. అయినా కూడా ఇవ్వన్ని  గ్రేటర్ ప్రజలు పట్టించుకున్న పాపాన పోలేదు. గ్రేటర్ పోరులో తమ బద్దకాన్ని ప్రదర్శించారు. ఇళ్ల నుంచి కదిలి ఓటు కోసం పోలింగ్ బూతు వరకు రాలేకపోయారు.



ఓటు హక్కు వినియోగించుకోండి అంటూ సెలబ్రిటీల నుంచి ఈసీ వరకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినా... గ్రేటర్ వాసుల్ని ఏ మాత్రం కదలించలేకపోయాయి. ఈ ప్రభావంతో గతంలో ఎన్నడూ లేనంతగా పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది. మంగళవారం జరిగిన  ఎన్నికలు మద్యాహ్నం 1 గంట వరకు కేవలం 18.2 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. అంటే ఆరు గంటల పాటు.. కేవలం 18.2 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం పెరుగుతుందని అంతా భావించారు. కాని సాయంత్రం నాలుగు అయినా అదే పరిస్థితి. దీనిని బట్టి ఓటింగ్‌ పై హైదరాబాద్ ప్రజలు ఎంత ఆసక్తితో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. హైదరాబాద్‌ గ్రేటర్ హైదరాబాద్ గా మారిన తర్వాత 2010లో తొలిసారిగా ghmc ఎన్నికలు నిర్వహిస్తే... 42.92 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఆ తర్వాత 2016లో జరిగిన ghmc ఎన్నికల్లో పోలింగ్ శాతం కాస్త పెరిగింది.


2016లో 45.29 శాతం నమోదైంది.. గడిచిన రెండు ఎన్నికల్లో హైదరాబాద్‌లో 50 శాతం కూడా పోలింగ్ దాటలేదు.. ఇక ఈసారి ఎన్నికల విషయానికొస్తే.. ఓటు వేయడానికి ఎవరూ కదిలి రాలేదు. ముఖ్యంగా యువత అయితే మరి నిర్లక్ష్యం ప్రదర్శించింది. అయితే అధికారులు మాత్రం దీనికి కరోనా ముఖ్య కారణమంటున్నారు. ‘పోలింగ్ డే’ని ‘హాలిడే’గా కార్పొరెట్ ఉద్యోగులు ఎంజాయ్ చేస్తున్నారు. ఓటు వేయకపోవడం బాధ్యతారాహిత్యమే అని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటు వేయడంతో ఇంత నిర్లక్ష్యమా అని చదువుకోలేని వారు సైతం మండిపడుతున్నారు.ఇలాంటి మరెన్నో వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....

మరింత సమాచారం తెలుసుకోండి: