బీజేపీ పార్టీ దేశంలో వరుసగా రెండు సార్లు ప్రజాభిమానాన్ని కూడగట్టుకుని అధికారంలోకి వచ్చింది. ఉత్తరాదిన ఈ పార్టీ కి ఎదురులేదన్నది వాస్తవం.. కానీ సౌత్ కి వచ్చే సరికి ఇక్కడ ప్రాంతీయ పార్టీ ల హవానే ఎక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ లు అయినా టీడీపీ, వైసీపీ,తెరాస పార్టీ లు ఇక్కడ ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి.. తెలంగాణ విషయానికొస్తే రాష్ట్రం వచ్చిన దగ్గరినుంచి ఇక్కడ తెరాస దే పైచేయి.. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ను కూడా నమ్మలేదు ప్రజలు..

ఆలా వరుసగా రెండు సార్లు గెలుస్తూ వచ్చింది తెరాస పార్టీ.. ఈ నేపథ్యంలో తొలిసారి రాష్ట్రంలో పోటీ గా అవతరించింది బీజేపీ పార్టీ.. దుబ్బాక ఫలితం తమకు ఫేవర్ కు రావడంతో ఒక్కసారి గా తెలంగాణ లోబలమైన పార్టీ గా ఎదిగిన బీజేపీ పార్టీ ఇప్పుడు గ్రేటర్ లోనూ విజయ ఢంకా మోగించి మరింత బలపడాలని చూస్తుంది. అందుకోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది బీజేపీ. ఇప్పటికే తెలంగాణ లో కాంగ్రెస్ ను పక్కకు తోసి రెండో స్థానానికి ఎగబాకిన బీజేపీ పార్టీ ఇప్పుడు టీ ఆర్ ఎస్ ప్లేస్ కి ఎర్త్ పెట్టింది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి టీ ఆర్ ఎస్ ని గద్దె దింపి ఆ ప్లేస్ లో తమ పార్టీ ని నిలపాలన్నదే బీజేపీ ఆలోచన కాగా ఇప్పుడు గ్రేటర్ లోనూ అదే ఆశతో ముందుకు వెళుతుంది..ఉత్తరాది పార్టీగా గుర్తింపు బీజేపీ ఇప్పుడు దక్షిణాదిన బలపడే క్రమంలో  తన దృష్టి అంతా తెలంగాణా మీద కేంద్రీకరించింది. అసెంబ్లీ ఎన్నికల తరవాత చూసుకుంటే బీజేపీ క్రమక్రమంగా ఎదుగుతున్న తీరు కనిపిస్తుంది.. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన బీజేపీ ఒక్కో స్థానంలో బలం పెంచుకుంటూ వచ్చింది. భారతంలో కర్ణాటకకు తోడుగా సమీప తెలంగాణాని కైవసం చేసుకోవాలని చూస్తోంది. దానికి తగ్గట్టుగా వారికి దుబ్బాక ఉప ఎన్నికలు ద్వారం తెరిచినట్టయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ లో గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఎంపీ ఎలక్షన్స్ లో గెలుపే  వీరికి టోర్నమెంట్ లీగ్ దశలో గెలిచినట్లయింది. దీంతో గ్రేటర్ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది కూడా గెలిస్తే బీజేపీ అర్థ దశాబ్దపు కల నెరవేరుతుంది అనడంలో ఎలాటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: