బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో గడిచిన 24 గంటల్లో 56,988 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 663 మందికి పాజిటివ్ అని తెలిసింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,69,412కి చేరింది.అలాగే కరోనా మరణాలు కూడా స్వల్పంగా పెరిగాయి. బుధవారం కరోనా మహమ్మారి బారిన పడి ఏడుగురు మరణించారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు, గుంటూరులో ఒకరు, నెల్లూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు కరోనాతో మరణించారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,003కు చేరింది.అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. బుధవారం 1,159 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,55,485 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,924కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,01,66,698 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో నమోదు చెయ్యటం జరిగింది. ఇలాంటి మరెన్నో కరోనా అప్ డేట్స్ గురించి తెలుసుకోవడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫోలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...