నిన్న గాక మొన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు రణరంగాన్ని తలపించింది. మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ బీజేపీ మధ్య చాలా చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి కొన్నిచోట్ల బీజేపీ vs ఎమైఎం అన్నట్లు ఈ గొడవలు జరిగాయి. అయితే కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ లోని సుజనా ఫోరమ్ మాల్ వద్ద మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్ మీద బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం సంచలనం రేపింది. ఆయన తన కాన్వాయ్ లో డబ్బులు తీసుకువచ్చి అక్కడ టిఆర్ఎస్ కార్యకర్తలకు అందిస్తున్నారు అంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. అంతేకాక మంత్రి కాన్వాయ్ ని సోదాలు జరిపిన తరువాతే ఇక్కడి నుంచి కదలనివ్వాలని పోలీసులను కోరారు. అయితే మంత్రి దానికి తీవ్రంగా స్పందించారు.



 ఒక మంత్రిని ఆపుతారా అన్నట్టు ఆయన అక్కడ లోకల్ లీడర్స్ మీద ఫైర్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఒకరిద్దరు బీజేపీ కార్యకర్తలు ఆయన కారు అడ్డం పడినా ఆయన కారుతో ముందుకు దూసుకు వెళ్లారు. ఇప్పుడు అదే చర్చనీయాంశంగా మారింది. అయితే తనను చంపేందుకు కుట్ర చేశారని మంత్రి సంచలన ఆరోపణలు చేస్తే కాదు తన మీద దాడి సొంత మనుషులను పెట్టించి జరుపుకున్నారని బీజేపీ ఆరోపణలు చేసింది. గ్రేటర్ పరిధిలో బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేసింది మంత్రి పువ్వాడ వర్గానికి చెందిన మైనార్టీ నాయకులు అని ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షుడు సత్యనారాయణ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి మరి ఆరోపణలు చేశారు. 



హైదరాబాదులో మతకలహాలు సృష్టించి హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టి త్వరలోనే జరగబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని మంత్రి పువ్వాడ అజయ్ కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. ముందు నుండి పువ్వాడ అజయ్ ఫ్యామిలీ చరిత్ర అలాంటిదేం అని బీజేపీ కార్యకర్తల మీద దాడి చేసింది మంత్రి పువ్వాడ అనుచర వర్గం కాదని నరసింహ స్వామి కోవెల వద్ద ప్రమాణం చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాక  తెలంగాణలో బీజేపీ బలపడుతోంది కాబట్టి బీజేపీ అడ్డుకునేందుకు బిజెపి కార్యకర్తల మీద వరుస దాడులు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: