ఆంధ్రప్రదేశ్ పర్యటనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఆయన ఎప్పుడు వస్తారు ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. గానీ రాజకీయంగా మాత్రం ఎప్పుడూ దీనిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అమరావతి ప్రాంతంలో ఇప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పెద్ద ఎత్తున పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అమరావతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎప్పుడూ లేనివిధంగా అమరావతి రాజధానిగా ఉంటుంది అని సోము వీర్రాజు పదేపదే చెప్పడం గమనార్హం. రాజకీయంగా ఇప్పుడు అమరావతి అంశం అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న నేపథ్యంలో బీజేపీ తమ వైపు అమరావతి ప్రాంత ప్రజలను తిప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అందుకే సోము వీర్రాజు ఎక్కువగా రాజధాని ప్రాంతంలో పర్యటనలు చేయడమే కాకుండా ఎక్కువగా అమరావతికి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. త్వరలోనే ఆయన మరికొన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించే అవకాశం ఉందని అంటున్నారు.

రాజధాని ప్రాంత పరిధిలో పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన పర్యటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అమరావతి ప్రాంత రైతులతో ఆయన సమావేశం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు శంకుస్థాపన కూడా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బిజెపి కేంద్ర కార్యాలయాన్ని అమరావతి ప్రాంతంలో నిర్మిస్తామని సోము వీర్రాజు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఆయన దీనికి సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి శంకుస్థాపన కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది ఏంటి అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత కూడా లేదు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: