జనసేన తరుపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్...ఇప్పుడు వైసీపీ మద్ధతుదారుడుగా నడుచుకుంటున్న విషయం తెలిసిందే. జనసేన తరుపున గెలిచిన రాపాక ఇప్పుడు జగన్‌కు భజన చేయడంలో బాగా బిజీ అయిపోయారు. ఎప్పటినుంచో రాపాక వైసీపీ మద్ధతుదారుడుగా మారిపోయిన విషయం తెలిసిందే. అసలు వాస్తవానికి తాను వైసీపీ నుంచి పోటీ చేయాలని కానీ, అనూహ్యంగా జనసేనలోకి వచ్చి పోటీ చేయాల్సి వచ్చిందని కూడా చెప్పారు.

దీంతో జనసేన కార్యకర్తలు రాపాకని పట్టించుకోవడమే మానేశారు. అటు పవన్ కూడా రాపాక విషయంలో లైట్ తీసుకున్నారు. ఇక రాపాక మాత్రం పక్కా వైసీపీ ఎమ్మెల్యేగా మారిపోయి, జగన్‌కు భజన చేస్తూ కాలాన్ని గడిపేస్తున్నారని జనసేన కార్యకర్తలు మాట్లాడుతున్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా రాపాక, పేదల అవసరాలకు అనుగుణంగా సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారని,  పేదల ఇంటి కల సాకారం చేసింది అప్పట్లో వైఎస్ఆర్.. ఇప్పుడు వైఎస్ జగనే అని, జగన్ లాంటి నాయకుడు ఉండటం మన అదృష్టమని మాట్లాడారు.

అయితే రాపాక ఇలా జగన్‌కు భజన చేయడానికి కారణాలు లేకపోలేదని జనసైనికులు చెబుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో రాజోలు వైసీపీ టిక్కెట్ తనకు వస్తుందా? లేదా? అనే అనుమానంతో రాపాక ఉన్నారని చెబుతున్నారు. ఎందుకంటే రాపాక వైసీపీలో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని రాపాకనే స్వయంగా వివరించారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న అమ్మాజీ, బొంతు రాజేశ్వరరావులు కూడా తనతోపాటు దూకుడుగా ఉన్నారని రాపాక ఎప్పుడో చెప్పారు.

లేదంటే పార్టీ మూడు ముక్కలవుతుందని కూడా హెచ్చరించారు. అయితే ఈ పోటీలో రాపాకకు ఎక్కడ టిక్కెట్ దొరకదు ఏమో అని భయపడుతున్నట్లు కనబడుతోంది. పైగా మొన్న ఎన్నికల్లో రాపాక మీద ఓడిపోయిన బొంతుకే నెక్స్ట్ ఎన్నికల్లో జగన్ టిక్కెట్ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. అందుకే రాపాక, తనకు సమయం దొరికినప్పుడల్లా జగన్‌ని పొగిడే పని పెట్టుకున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: