నగరంలో 2004 వరకు డబుల్ డెక్కర్ బస్సులను తిప్పారు. వాటిని రద్దు చేసే సమయానికి మెహెదీపట్నం-సికింద్రాబాద్, మెహిదీపట్నం-చార్మినార్, సికింద్రాబాద్-చార్మినార్, సికింద్రాబాద్-జూపార్కు మార్గాల్లో నడిపారు. ఈ క్రమంలో మళ్లీ పటాన్ చెరుకు డబుల్ డెక్కర్ బస్సులను పంపాలని భావిస్తున్నారు. సికింద్రాబాద్, కోఠి నుంచి ప్రస్తుతం పటాన్ చెరుకు సాధారణ బస్సులు మంచి ఆక్యుపెన్సీతో తిరుగుతున్నాయి. ఆ మార్గానికి మంచి డిమాండ్ ఉండటంతో ఆ మార్గాల్లోనే వీటిని తిప్పితే బాగుంటుందని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాక, మేడ్చల్ రూట్లో ఉండే సుచిత్ర, కొంపల్లి వరకు మంచి రద్దీతో బస్సులు తిరుగుతున్నాయి. ఆ మార్గంలో కూడా తిప్పితే బాగుంటుందని యోచిస్తున్నారు. పాత బస్తీ నుంచి మెహిదీపట్నం, అక్కడి నుంచే జీడిమెట్ల వైపు కూడా సర్వీసులు తిప్పితే బాగుంటుందని భావిస్తున్నారు. దుర్గం చెరువు వద్దకు కూడా ఓ సర్వీసు ఉండేలా చూడా లని భావిస్తున్నారు. త్వరలో మంత్రి పువ్వాడ, ఎండీ సునీల్శర్మలతో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్త బస్సుల తయారీకి ఆర్డర్ ఇవ్వనున్నట్లు సమాచారం.
నగరంలో 2004 వరకు డబుల్ డెక్కర్ బస్సులను తిప్పారు. వాటిని రద్దు చేసే సమయానికి మెహెదీపట్నం-సికింద్రాబాద్, మెహిదీపట్నం-చార్మినార్, సికింద్రాబాద్-చార్మినార్, సికింద్రాబాద్-జూపార్కు మార్గాల్లో నడిపారు. ఈ క్రమంలో మళ్లీ పటాన్ చెరుకు డబుల్ డెక్కర్ బస్సులను పంపాలని భావిస్తున్నారు. సికింద్రాబాద్, కోఠి నుంచి ప్రస్తుతం పటాన్ చెరుకు సాధారణ బస్సులు మంచి ఆక్యుపెన్సీతో తిరుగుతున్నాయి. ఆ మార్గానికి మంచి డిమాండ్ ఉండటంతో ఆ మార్గాల్లోనే వీటిని తిప్పితే బాగుంటుందని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాక, మేడ్చల్ రూట్లో ఉండే సుచిత్ర, కొంపల్లి వరకు మంచి రద్దీతో బస్సులు తిరుగుతున్నాయి. ఆ మార్గంలో కూడా తిప్పితే బాగుంటుందని యోచిస్తున్నారు. పాత బస్తీ నుంచి మెహిదీపట్నం, అక్కడి నుంచే జీడిమెట్ల వైపు కూడా సర్వీసులు తిప్పితే బాగుంటుందని భావిస్తున్నారు. దుర్గం చెరువు వద్దకు కూడా ఓ సర్వీసు ఉండేలా చూడా లని భావిస్తున్నారు. త్వరలో మంత్రి పువ్వాడ, ఎండీ సునీల్శర్మలతో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్త బస్సుల తయారీకి ఆర్డర్ ఇవ్వనున్నట్లు సమాచారం.