గత నాలుగు రోజుల క్రితం కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ సోమవారం మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేడు అసెంబ్లీలో మహిళా సంక్షేమంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. మహిళా సాధికారత కోసం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు ఎమ్మెల్యే రోజా. మహిళలు తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి వైఎస్ గన్ కృషి చేస్తున్ననారని.. కానీ చంద్రబాబుది 420 విజన్‌ అని అన్నారు. అలాగే వైఎస్‌ జగన్‌ విజన్‌.. ఓ విప్లవం అన్నారు. 



సీఎం జగన్.. వచ్చే జనరేషన్‌ గురించి ఆలోచించే ప్రజా నాయకుడని.. ప్రతి ఆడ బిడ్డను రక్షించే దిశ చట్టాన్ని తెచ్చారన్నారు. ఎన్నో పథకాలు తీసుకొచ్చిన వైఎస్‌ జగన్‌.. ఓ క్రియేటర్‌. వైఎస్ జగన్ ఫేక్ సీఎం కాదు.. టీడీపీ, చంద్రబాబును షేక్‌ చేసిన ముఖ్యమంత్రి అన్నారు. నారా లోకేష్‌కు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ట్విటర్‌లో పెట్టడమే తెలుసు.. సర్పంచ్‌గా కూడా గెలవలేని వ్యక్తి లోకేష్ అని నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.

మహిళలకు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో సీఎం జగన్ మహిళలకే పెద్దపీట వేశారన్నారు. మహిళల అభ్యున్నతికి చంద్రబాబు చేసింది ఏమీ లేదని.. వ్యవస్థల్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు. తోబుట్టువు కంటే ఎక్కువగా మహిళల్ని సీఎం జగన్ అభిమానిస్తారని.. పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చాక జగన్ అమలు చేశారని అన్నారు. క్రియేటివ్ ఆలోచనలు ఉన్న సీఎం వైఎస్ జగన్.. మహిళలకు ఆస్తులను క్రియేట్ చేసి చూపిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు. పేదవాళ్లకు ఇచ్చే ఇళ్లపై కూడా టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: