అయితే మొన్నటి వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించిన అభ్యర్థులకు సంబంధించిన జాతకాలు నేడు తేలిపోనున్నాయి. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్నది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర ప్రచారం చేపట్టిన అభ్యర్థులు ఏమేరకు ప్రజలను ఆకర్షించారు అన్నది నేడు ఫలితాలలో తేలనుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం నేడు జరుగుతున్న ఓట్ల కౌంటింగ్ పై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాజకీయాల చూపు మొత్తం జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ మీద ఉన్న విషయం తెలిసిందే.
గతంలో దుబ్బాకలో అనూహ్యంగా ఊహించని విధంగా బిజెపి విజయం సాధించిన నేపథ్యంలో ఇక ఈ సారి కూడా బిజెపి విజయం సాధిస్తాము అంటూ ధీమా వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన ఫలితం ఎవరికి ఫేవర్ గా వస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది మరోసారి అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిచి మేయర్ పీఠాన్ని అధిరోహించ నుందా లేదా దుబ్బాకలో లాగానే సీన్ రిపీట్ అయి జీహెచ్ఎంసీ ఎన్నిక లో బీజేపీ గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందా అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అంతా హాట్ హాట్ గా మారిపోయింది వాతావరణం.