అంతేకాదు ఎన్నికల సంఘం తీరుపై కోర్టుకు కూడా ఆశ్రయించారు. ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు వచ్చినందువల్లే టీఆర్ఎస్కు ఫేవర్ గా ఉండే విధంగా రాత్రికిరాత్రి ఎన్నికల కమిషన్ ఈ సర్క్యులర్ జారీ చేసింది అంటూ బిజెపి ఆరోపించింది. ఈ సర్కులర్ ను వెంటనే రద్దు చేయాలి అంటూ బీజేపీ డిమాండ్ చేసింది. అయితే ఎన్నికల కౌంటింగ్ ను తాము అడ్డుకోబోమని అంటూ స్పష్టం చేసిన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్.. ఇలా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు గుణపాఠం తప్పదు అంటూ హెచ్చరించారు. అయితే ఎన్నికల పోలింగ్ శాతం పై కూడా ఎన్నికల సంఘం ఇదే తీరులో వ్యవహరించిందని అంటూ ఆరోపించారు.
మధ్యాహ్నం మూడు గంటల వరకు గంటగంటకు పోలింగ్ శాతం యొక్క వివరాలు ఇచ్చినప్పటికీ సాయంత్రం 5 నుంచి 6 గంటల నడుమ పోలింగ్ శాతం ఎన్నికల సంఘం వెల్లడించడం వెనుక అంతర్యం ఏమిటి అంటూ ప్రశ్నించింది. అర్ధరాత్రి దాకా ఎందుకు సమయం పట్టిందో చెప్పాలి అంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన పోలింగ్ కు టిఆర్ఎస్ ఓ పథకం ప్రకారం వేసింది అంటూ ఆరోపించారు బండి సంజయ్. టిఆర్ఎస్ కు అనుకూలంగా పోలింగ్ శాతం మార్చేందుకు కుట్రలు పన్నారు అంటూ బండి సంజయ్ ఆరోపించారు.