డిజిటల్ సర్వీసులు సరిగ్గా అందించకపోవడం లో ఒకరితో ఒకరు పోటీపడుతున్నాయి ఈ రెండు బ్యాంకులు. ఏకంగా కస్టమర్ల సహనాన్ని పరీక్షిస్తాయి. ఈ మధ్యకాలంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిజిటల్ సర్వీసులు తరచు మొరాయిస్తూ ఉన్నాయి ఎప్పుడంటే అప్పుడు పనిచేయడం లేదు దీంతో ఖాతాదారుల పై ఇది ఎంతగానో ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. డిజిటల్ సర్వీస్ లలో తలెత్తిన సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేంత వరకు డిజిటల్ సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయాలంటూ హెచ్డిఎఫ్సి ని ఆదేశించింది.
ఇక మరోవైపు ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ కస్టమర్లకు డిజిటల్ సర్వీసుల విషయంలో ప్రస్తుతం చుక్కలు చూపిస్తుంది. యోనో యాప్ సర్వీసులు తరచుగా కస్టమర్లకు అందుబాటులో ఉండక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం కస్టమర్లు. ఈ క్రమంలోనే ఎంతో మంది కస్టమర్లు సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం తమ కష్టాలను సోషల్ మీడియా వేదికగా బ్యాంకు దృష్టికి తీసుకెళ్తున్నారు. దేశంలోనే రెండు అతిపెద్ద బ్యాంకులలో ఇలాంటి సమస్యలతో ఉండడంతో ప్రస్తుతం ఎంతో మంది కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఈ రెండు బ్యాంకుల కస్టమర్ల ఇబ్బందులు ఎప్పుడు తీరుతాయో చూడాలి మరి.