జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడిన సమయంలో బిజెపి ఊహించని విధంగా అనూహ్యంగా భారీ మెజారిటీ కొనసాగించింది. దీంతో జిహెచ్ఎంసి ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ ఘన విజయం సాధిస్తుంది అని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం మళ్ళీ అంతా తారుమారు అయ్యింది మళ్లీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చేసింది. 150 డివిజన్లలో శరవేగంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా కొన్ని డివిజన్లలో ఇప్పటికే ఫలితం తేలిపోయింది అనే విషయం తెలిసిందే . అయినప్పటికీ టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది అని చెప్పాలి





 అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేల మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం దూమారం రేపుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు టిఆర్ఎస్ కన్నా బిజెపికి అత్యధిక ఓట్లు రావడం పై స్పందించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి కి వచ్చిన ఓట్లు అన్నీ కూడా ఉద్యోగులు వృద్ధుల ఓట్లే అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ప్రస్తుతం బీజేపీకి వచ్చిన ఓట్ల ను గమనిస్తే రెండు విషయాలు అర్థం చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. సాధారణ ప్రజలు టిఆర్ఎస్ కు ఎంతో వ్యతిరేకంగా ఉన్నారని... వారందరూ జీహెచ్ఎంసీలో టిఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం బీజేపీ అని భావించారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.



 దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ను ఎదుర్కోలేదు అని అక్కడి ప్రజలు భావించారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ ప్రాంతాలలో ఆధిక్యంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపిలో చేరేందుకు సిద్ధమయ్యారు అని అందుకే ఆయన ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేశారని ప్రస్తుతం టాక్ కూడా వినిపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి బిజెపిలో చేరుతారని ప్రచారం జరిగగా..  ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఇది కన్ఫర్మ్ అయిపోయింది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: