అయితే, ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున తొలి విజయం సాధించిన అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవ్వడం జరిగింది. ఎన్నికల ప్రచారం సమయంలో యూసఫ్గూడలో మంత్రి కేటీఆర్ రోడ్ షోలో భాగంగా.. ‘‘ముందుకు రా.. దండం పెట్టుకో.. బాగున్నాడా.. వెనక్కి పో’’ అని ఆ అభ్యర్థిని ఉద్దేశించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సీన్ సోషల్ మీడియాలో చాలా విపరీతంగా వైరల్ అయింది.
టీఆర్ఎస్ వ్యతిరేకదారులైతే ఏకంగా మంత్రి కేటీఆర్ తీరును తప్పుబడుతూ ఓ గంగిరెద్దు వీడియోతో దాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆ అభ్యర్థే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలి విజయాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక మధ్యాహ్నం 2 గంటల సమయానికి టీఆర్ఎస్ పార్టీ 40 చోట్ల ఆధిక్యం కనబర్చగా.. బీజేపీ 36 చోట్ల ముందంజలో ఉంది. ఎంఐఎం 13 స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఈ సమయానికి ఎంఐఎం 5 చోట్ల గెలవగా, టీఆర్ఎస్ 2 స్థానాల్లో గెలవడం జరిగింది. ఇంకా ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రాజకీయ వార్తల గురించి తెలుసుకోండి...