గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అలాగే బిజెపి పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయన్న సంగతి తెలిసిందే. దీనికి ముందు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీకి చెందిన అభ్యర్థి రఘునందన్రావు విజయం సాధించడంతో బీజేపీ దృష్టి ఈ గ్రేటర్ ఎన్నికల మీద పడింది. ఎలాగైనా ఈ గ్రేటర్ ఎన్నికల్లో కూడా సత్తా చాటి బీజేపీని బలపరచు కొనేందుకు పార్టీ శ్రేణులు గట్టిగానే కష్టపడ్డారని చెప్పాలి. అసలు తెలంగాణలో బిజెపి లేదు అన్న మాట నుంచి తెలంగాణలో బిజెపి ఒక బలవంతమైన పార్టీగా అవతరించింది. అయితే అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం భారీగా సీట్లు కోల్పోయిందని చెప్పవచ్చు. 



గతంలో 99 స్థానాలు గెలుచుకున్న అధికార టీఆర్ఎస్ ఈ సారి మేయర్ పీఠం గెలుచుకునేందుకు కూడా సరిపడా స్థానాలను గెలుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం 148 స్థానాలకి కౌంటింగ్ పూర్తిగా అందరూ 56 స్థానాలకు మాత్రమే టిఆర్ఎస్ కైవసం చేసుకుంది/ మరో రెండు స్థానాల్లో కౌంటింగ్ పూర్తయి అవి టిఆర్ఎస్ చేతికి చిక్కిన 58 మాత్రమే అవుతాయి. దీంతో మేయర్ స్థానం సాధించాలి అంటే కచ్చితంగా మరో ఏడుగురు మద్దతు అవసరం అవుతుంది. ఎక్స్ అఫీషియో సభ్యులు అంతా కలిపి హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ చేసుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 102 చేరుకోవాల్సి ఉంటుంది. 



ఎలాగూ టిఆర్ఎస్ కి ఎక్స్అఫీషియో సభ్యుల సంఖ్య 35 ఉంది కాబట్టి 65 డివిజన్లోని గెలుచుకుంటే టిఆర్ఎస్ సొంతంగా మేయర్ పీఠం దక్కే అవకాశం ఉండేది. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే 60 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. దీంతో ఎప్పటిలాగే ఎంఐఎం పార్టీ మద్దతు కోరే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి మజ్లిస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ విరోధులులాగా విమర్శలు చేసుకున్నాయి. ఇప్పుడు సరైన బలం లేకపోవడంతో మరలా ఆ పార్టీ మద్దతు కోరాలంటే ఆ పార్టీ నేతలను కాకా పట్టక తప్పదు అనే వాదన వినిపిస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: