దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో విజయం నియోజకవర్గాల్లో బీజేపీ ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. అందుకు ప్రణాళికలను పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ రూపొందించారు. ఇక గ్రేటర్ లో తెచ్చిన మార్పు సందర్భంగా బండి సంజయ్ కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ అహంకారపూరిత వైఖరిని, అవినీతిని అంతం చేసే పార్టీ బీజేపీయేనని గ్రేటర్ ప్రజలు గుర్తించారని అన్నారు..గ్రేటర్ ఎన్నికల ఫలితాలు తర్వాత బీజేపీ నేతలతో కలసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
బీజేపీ విజయాన్ని డీజీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్లకు అంకితం చేస్తున్నామని సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆంక్షల మేరకు బీజేపీ పని చేస్తుందని చెప్పారు. అయితే గ్రేటర్ ఎన్నికల ప్రచార సమయంలో, ఇప్పుడు ఫలితాల సమయంలో బండి సంజయ్ మాటల్లో చాలా మార్పు కనిపించింది. అప్పుడు నోటికి ఎదోస్తే అదే మాట్లాడే బండి సంజయ్ ఇప్పుడు ఎంతో హుందాగా, హోదాగా మాట్లాడారు.. దుబ్బాక లో గెలిచిన తరువాత కూడా సంజయ్ లో ఈ మార్పు కనపడలేదు.. కేంద్ర నేతల కళ్ళల్లో పడుతున్న సంజయ్ కి ఇది మంచి పరిణామమే.. త్వరలో అధికారంలో కి వస్తామని బండి ఇపుడు ఈ విధంగా రూటు మార్చారేమో మరీ..