ఇదే కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. బీజేపీ నేతలు దీన్ని గెలుపుగానే భావిస్తున్నారు..అందుకే జోరుగా సంబరాలు చేసుకుంటున్నారు.. నిన్న బీజేపీ భవన్ లో సంబరాలు మిన్నంటాయి.. ఇక ఈ ఫలితాలు ఎవరు గ్రేటర్ లో అధికారం చేపడతారో అన్నది ఆసక్తి కరంగా మారింది.. కాంగ్రెస్ పార్టీ కి రెండు సీట్లు రాగ, మిగితా పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కలేదు.. మొత్తానికి ఈ ఎన్నికల్లో హ్యాంగ్ రావడంతో ఎంఐఎం ఎలాంటి గొంతెమ్మ కోరికలు కోరుతుందో అని తెరాస నేతల్లో టెన్షన్ పట్టుకుంది..
అయితే హంగ్ ఏర్పడినా పాలక మండలిని ఏర్పాటు చేసే అవకాశం టీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఆ పార్టీ ఎంఐఎంతో కలసి జీహెచ్ఎంసీ పాలన చేపట్టాల్సిన తప్పని పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసే.. ఎక్స్ అఫిషియో సభ్యులతో సంబంధం లేకుండా పాలక మండలి ఏర్పాటవుతుంది. మేజిక్ ఫిగర్ 98 కాగా.. టీఆర్ఎస్ 56, ఎంఐఎం 43.. వెరసి ఆ రెండు పార్టీల బలం 99కు చేరుతుంది. తుది ఫలితాల తర్వాత ఒకట్రెండు రోజులకు రాష్ట్ర ఎన్నికల సంఘం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ లోపు ఆ రెండు పార్టీలు ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది.