వైసీపీ పార్టీ తరపున గెలిచి రెబల్ గా మారిపోయిన రఘు రామ కృష్ణం రాజు పార్టీ విధానాలని కుంగ లో తొక్కి పార్టీ శ్రేణులను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.. పార్టీ లో ఏదైనా అసంతృప్తి ఉందా అంటే అది ఈయన విషయమే.. టీడీపీ లో చంద్రబాబు లాంటి వాళ్ళను నిలువరిస్తున్న వైసీపీ నేతలు సొంత పార్టీ ఎంపీ ని మాత్రం ఆపలేకపోతున్నారు.. టీడీపీ ని నయనో భయానో భయపెట్టి నోర్లు మూయించిన రాజు గారిని మాత్రం ఎక్కడా అడ్డుకోలేకపోతున్నారు.. ఆయన అవినీతి గురించి బయట పెడదామా అంటే సొంత పార్టీ నేత అయిపోయారు.. పోనీ బుజ్జగిద్దమా అంటే వైసీపీ అంటే ఆమడ దూరం వెళ్తున్నారు..

ఈయన వల్ల ఈయనను ఆదర్శంగా తీసుకుని వైసీపీ పార్టీ లో అసంతృప్తుల జ్వాలలు రోజు రోజు కి పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు. ప్రతిపక్షాలు అయితే దీనివల్ల ఎంతో సంతోషిస్తున్నాయి.. అలాగే వర్గ విభేదాలు కూడా పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.. పలు నియోజకవర్గాల్లో వైసీపీ లో ని రెండు వర్గాలకు అస్సలు పడడం లేదు. దీంతో వైసీపీ లో ఈ సంస్కృతి ఇలా కొనసాగితే పార్టీ కి కష్టాలు తప్పవని పెద్దలు చెప్తున్నారు..

అంతేకాదు అసంతృప్తి నేతలు ఈయనను ఆదర్శంగా తీసుకుంటున్నారట..గోదావరి జిల్లాల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీఎపీలో గ్రూప్ రాజకీయాలకు తెర తీస్తున్నాడు. ఆయన పార్టీ గీతను దాటేసి మరీ సొంత పార్టీ నేతల మీదనే బహిరంగ లేఖలు రాస్తున్నారు. ఆయనకు అటు రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఇటు టీడీపీ పెద్దలు కూడా మద్దతు ఇవ్వడం చూస్తూంటే గోదావరి జిల్లాల్లో వైసీపీలో నిరసన జ్వాలలు పెరిగిపోతున్నాయని చెప్పాలి.. ఇంకా ఎంపీల్లో చాలా మంది ఇప్పటికే జగన్ మీద గుర్రుగా ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు కూడా తమకు విలువ, గౌరవం పార్టీలో లేవా అంటూ గొంతు పెంచుతున్నారు. వీరందరికీ రఘురామ కృష్ణంరాజు ఇన్సిపిరేషనట.

మరింత సమాచారం తెలుసుకోండి: