బిజేపి ఈ ఎన్నికల్లో ఇంతటి కీలక పాత్ర పోసించడానికి ముఖ్య కారణం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనే చెప్పాలి. ఈ నేపద్యంలో బండి సంజయ్ కి డిల్లీ నుండి పిలుపు వచ్చిందట. అందువల్ల హస్తినకు పయనం అవుతున్నారు... దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది బీజేపీ... ఈ నేపథ్యంలో బండి సంజయ్.. ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఆదివారం రోజు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. తన పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా, మరికొందరు నేతలను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఫలితాల వివరాలు జాతీయ నేతలతో చర్చించి పార్టీకి సంబందించిన తదుపరి కార్యాచరణను చేర్చించనున్నట్టు సమాచారం.