సివిల్ సప్లై మంత్రిగా ఉండి ధాన్యం రైతు గురించి మాట్లాడుతున్నావా అని ఆయన నిలదీశారు. జగన్మోహరెడ్డి అంతరంగంలో ఉన్న మాటలు కొడాలి నాని బూతు మాటలు అని ఆయన విమర్శించారు. నీ మంత్రి పదవిని కాపాడుకోవడానికి ఊడిగం చేస్తున్నావు,గాలి మాటలు మాట్లాడుతున్నావు అన్నారు. ఫేక్ ముఖ్యమంత్రి గురించి కొడాలి నాని మాట్లాడుతున్నాడు ,తెలంగాణలో జెండా ఎత్తేసారు అని... తెలుగుదేశం 106 సీట్లు పోటీ చేసింది, వైసిపి లాగా లాలూచీ పడలేదు అని అన్నారు.
ఆ రోజు వైస్రాయ్ హోటల్ గేటు వద్ద నిలబడ్డ వాడివే, చంద్రబాబు బిక్ష తో టిడిపి ఆర్థిక సాయం చేస్తే ఎమ్మెల్యే అయినావు అన్నారు. జగన్మోహన్రెడ్డి పైశాచిక ఆనందం కోసం మాట్లాడుతున్నావు అని, ఆకాశం వైపు ఉమ్మేస్తే నీ మొహం పై పడుతుంది అని విమర్శించారు. నందిగామ, మైలవరం ఎమ్మెల్యేలు గొప్పలు చెప్పారు ఈ రోజు ఎందుకు సుబాబుల్ రైతుల గురించి మాట్లాడటం లేదు అని విమర్శించారు. ఇసుక పందికొక్కులు ఎవరో తెలియదా ఎమ్మెల్యేలు మంత్రులు కాదా అని ఆయన నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే పోలవరం ప్రాజెక్ట్ కు లెక్కల రాసుకుని ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు తీసుకెళ్ళామ అంటే ఆ అధికారులపై చర్యలు తీసుకోండని ఆయన సవాల్ చేసారు.