ఇటీవలే బీహార్ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు దేశ రాజకీయాలన్నీ వెస్ట్ బెంగాల్ చుట్టూ తిరుగుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అక్కడి రాజకీయాలు క్రమక్రమంగా ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ఒకదానికి మించి మరొకటి ఎత్తులు వేస్తున్నాయి. టీఎంసీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే టీఎంసీ కీలక నేత సువేందు అధికారి మంత్రి పదవికి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. ఇప్పటికేమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఒత్తిడిలో ఉండగా.. ఆమెకు షాకిచ్చేలా సొంత తమ్ముడే సంచలన వ్యాఖ్యలు చేశారు.



పశ్చిమ బెంగాల్‌లో వారసత్వ రాజకీయాలకు చరమ గీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని మమత సోదరుడు కార్తీక్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ప్రజల జీవితాలను బాగు చేయాలని మాట్లాడుతూ.. తమ సొంత కుటుంబ సభ్యుల జీవితాలను మెరుగుపర్చుకుంటున్న రాజకీయ నాయకుల తీరుతో విసిగిపోయానంటూ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్తీక్ బీజేపీలో చేరి పొలిటికల్ లైఫ్ ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. మీ సోదరిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారా..? అని మీడియా ప్రశ్నించగా.. రాజకీయాల్లో వంచన గురించి నేను మాట్లాడుతున్నానంటూ ఆయన బదులిచ్చారు. ప్రజల కోసం, వారి జీవితాలను మెరుగుపర్చడం కోసమే రాజకీయాలు ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. ప్రజా సేవలో ఉన్నవారు.. జనం గురించి ముందు ఆలోచించి.. తర్వాతే కుటుంబం గురించి ఆలోచించాలన్నారు. మీరు బీజేపీలో చేరబోతున్నారా అని ప్రశ్నించగా.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమంటూ ఆయన తెలివిగా సమాధానం ఇచ్చారు. కార్తీక్ వ్యాఖ్యలు చూస్తుంటే.. బెంగాల్ పీఠమే తమ ప్రధాన లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. ఇప్పుడు మమతా ఫ్యామిలీనే టార్గెట్ చేసి తద్వారా తమ లక్ష్యాన్ని నెరవేర్చుకునే అవకాశాలు సృష్టిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ బెంగాల్ రాజకీయాలు అప్పుడే దేశవ్యాప్తంగా చర్చల్లో నిలుస్తున్న విషయం సుస్పష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: