అనంతరం ఆమెను న్యాయమూర్తి నివాసంలో హాజరు పరుస్తారు. న్యాయమూర్తి ఎదుట హాజర పరిచిన తరువాత తిరిగి ఆమెను చంచల్ గూడ జైలుకు తరలిస్తారు. కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి లోధా అపార్ట్ మెంట్ నుంచి బోయిన్ పల్లి స్పాట్ వరకు కిడ్నాపర్లు ఏ వివరాలు వదిలారో వాటన్నిటి గురించి భూమా అఖిల ప్రియను ప్రశ్నిస్తున్నారు. అయితే అఖిల ప్రియ కొన్ని విషయాలకు సంబంధించి నోరు విప్పలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ఎక్కడుంది ఇంకా తెలియ రాలేదు.
తన భర్త ఎక్కడున్నాడనే దానిపై కూడా పోలీసులు భూమా అఖిల ప్రియను విచారిస్తున్నారు. కాగా.. పోలీసులు ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి మరో 15 మంది కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందుతులైన చంద్రహాస్, భార్గవ్, గుంటూరు శ్రీను కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ ముగ్గురు నిందితుల ఆచూకీ లభిస్తే ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలు మొత్తం వెలుగులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.