హెచ్‌-1బీ వీసాల ఎంపిక ప్రక్రియలోని కీలక సవరణపై.. ఫైనల్ ప్రకటన వచ్చింది. ఈ మేరకు హోంల్యాండ్‌ సెక్యూరిటీ  తుది ప్రకటనను రిలీజ్ చేసింది. ఈ కొత్త విధానం వల్ల విదేశీ విద్యార్థులు చాలా నష్టపోతారు. పట్టభద్రులైన తర్వాత కొంతకాలం అమెరికాలో పనిచేయాలనుకునే వారికి అవకాశాలు తగ్గుతాయి.

భారతీయులతో పాటు ఇతర దేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులు అమెరికాలో పని చేయాలంటే తప్పనిసరిగా హెచ్‌-1బీ వీసా అవసరం. కొంతకాలంగా ఈ వీసా ఎంపిక ప్రక్రియలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ట్రంప్‌ అధ్యక్షుడైన తర్వాత నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఇటీవల హెచ్‌-1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో కీలక సవరణ చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ విధానం కాకుండా, అభ్యర్థుల ఎంపికలో వేతనాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తామని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా నిబంధనల సవరణపై... హోంల్యాండ్‌ సెక్యూరిటీ తుది ప్రకటన చేసింది. దీంతో ఏడాదికి సరిపడా జారీ చేసే...85వేల.. హెచ్‌-1బీ వీసాలను..... వేతనాలు, నైపుణ్యాల ఆధారంగా ఇవ్వనున్నారు.

కొత్త విధానం వల్ల అందరికీ లాభదాయకమేనని అమెరికా చెబుతున్నా..... విదేశీ విద్యార్థులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతిభ గల విద్యార్థులు హెచ్‌-1బీ వీసా పొజిషన్స్‌లో లెవల్‌-1కు అర్హులవుతారు. వీరంతా శిక్షణా కాలంలో ఉంటారని, వారిని అత్యధిక వేతనం పొందుతున్న వారిగా పరిగణిస్తామని యూఎస్‌సీఐఎస్‌ చెబుతోంది. అయితే, కేవలం STEM విద్యార్థులు మాత్రమే మూడేళ్ల ఆప్ట్‌ కాలానికి అర్హత సాధించే అవకాశం ఉంది. కానీ, ఏడాది OPT కాలానికి అర్హత సాధించే విదేశీ విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని కోల్పోతారు.

అనుభవంతో పాటు మాస్టర్స్‌ డిగ్రీ ఉన్న కొందరు విద్యార్థులు లెవల్‌-2 పొజిషన్స్‌కు అర్హులైనా కూడా వారు అర్హత సాధించలేకపోవచ్చు. అమెరికాలో చదువుకునాలనుకునే వారిపై ఈ మార్పులు ప్రభావం చూపుతాయి. పట్టభద్రులైన తర్వాత కొంతకాలం అమెరికాలో పనిచేయాలనుకునే వారికి అవకాశాలు తగ్గుతాయి.

తాజా నిబంధనల ప్రకారం అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగులకు మొదటగా యూఎస్‌సీఐఎస్‌ వీసాలు మంజూరు చేస్తుంది. అదే సమయంలో వారి స్థాయిని బట్టి, అత్యధిక నైపుణ్యం ఉన్న వారినీ పరిగణనలోకి తీసుకుంటుంది. వీరంతా లెవల్‌-4 పొజిషన్‌లో ఉంటారు. అక్కడి నుంచి దశల వారీగా లెవల్‌-1 వరకూ వీసాలు మంజూరు చేస్తుంది. ఈ నిబంధనలు ఈ ఏడాది మార్చి 9 వరకూ అమల్లో ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: