తెలుగు వారి అచ్చమైన తెలుగు పండుగల్లో "సంక్రాంతి" పండుగ ఒకటి. ఈ పండుగను ఒక్క తెలుగువారే కాక దక్షిణాదిన మొత్తం కూడా ఎంతో సంప్రదాయకంగా జరుపుకుంటారు.ముఖ్యంగా పల్లెలో సంక్రాంతి పండుగ వాతావరణం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఏ ఇంటి దగ్గర చూసిన పెద్ద పెద్ద ముగ్గులతో, పిల్లల ఆట పాటలతో, హరిదాసు కీర్తనలతో,అబ్బో ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి సంభరాలు పల్లెల్లో అని ఇన్ని కావు. ఇంత ప్రతిష్టాత్మకమైన పండుగకు ప్రముఖుల శుభాకాంక్షలతో ట్విటర్ హోరెత్తింది.

దేశ ప్రధాని నరేంద్ర మోడి ట్విటర్ వేదికగా దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. "భారతదేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన ప్రజలు మకర సంక్రాంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పర్వదినం భారతదేశ వైవిధ్యాన్ని, మన సంప్రదాయాల చైతన్యాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ పండుగ ప్రకృతి ప్రాముఖ్యతను కూడా ప్రోత్సహిస్తుంది” అని పేర్కొంటూ మోదీ ట్వీట్ చేశారు. అలాగే టాలీవుడ్ ప్రముఖులు కూడా "సంక్రాంతి " శుభాకాంక్షలతో ట్విటర్ ను హోరెత్తించారు.

ఈ క్రమంలో చిరంజీవి, మహేష్‌బాబు, సమంత, జూనియర్‌ ఎన్‌టి‌ఆర్  వంటి వారు తమ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. " అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు! భోగ భాగ్యాల ఈ సంక్రాంతి అందరి ఇంట కలల పంట పండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశాడు. అదే విధంగా ‘మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు’ అంటూ సూపర్ స్టార్ మహేశ్ తెలిపాడు. ఇక స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ " అందరికీ శుభాకాంక్షలు.ఈ పండుగ మీ జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నా" అంటూ ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: