బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బృందంతో కలిసి పోరాటం చేయడానికి జనసేన కమిటీ పనిచేయనున్నట్లు సమాచారం. నలుగురు సభ్యులుండే ఈ కమిటీకి పార్టీ ప్రధాన కార్యదర్శి పి.శివశంకర్ నేతృత్వం వహిస్తారు. సభ్యులుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పాలవలస యశస్విని, పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీ సభ్యులు గడసాల అప్పారావు, డాక్టర్ బొడ్డేపల్లి రఘు వ్యవహరిస్తారు.
రామతీర్థంలో ఘటనపై ఇంతవరకూ ఎటువంటి పురోగతి లేదని పవన్ మండిపడ్డారు. రామతీర్థంలో స్వామికి అపచారం జరిగి వారాలు గడుస్తున్నా ఈ కేసులో ఇంత వరకు ఎటువంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. తమకు స్వేచ్చను ఇస్తే ఎటువంటి కేసునైనా గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తామని పోలీసు అధికారులు తరచూ ఆఫ్ది రికార్డుగా చెబుతుంటారని అన్నారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి స్థాయి స్వేచ్చను ఇవ్వలేదని అనుమానించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి పవన్ భావిస్తున్నారు. తమ కమిటీ ద్వారా అసలు దోషులెవరో వెలికితీయాలని వపన్ కల్యాణ్ ధృడ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది.