దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి కానీ తరగడం లేదు. దేశంలో ఏదోక్కప్రాంతంలో కామాంధుల వికృత చేష్టలకు అమ్మాయిల నిండు జీవితాలు బలైపోతున్నాయి. తాజాగా బీహార్‌లో ఘోరం జరిగింది. మైనర్ బాలికను నలుగురు దుండగులు అత్యాచారం చేశారు. అనంతరం చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. బతికుండగానే పెట్రోల్ పోసి తగుబెట్టారు. ముజఫర్‌పూర్‌లో జనవరి 11న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితురాలు.. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూసింది.

ఇక బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నలుగురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడినట్లు చనిపోయే ముందు బాలిక వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు... నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే వారిని పట్టుకొని కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. అంతేకాదు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున సాయం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఐతే పోలీసుల దర్యాప్తుపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఘటన జరిగి 3 రోజులవుతున్నా ఇంకా ఎలాంటి పురోగతి లేదని.. నిందితులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే బీహార్‌లో ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధుబన్ జిల్లాలో 15 ఏళ్ల బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను తీవ్రంగా గాయపర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. మధుబాన్‌ జిల్లా ఎస్పీ సత్యప్రకాశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హర్లకి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కౌవహ బర్హి గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన బాలిక తన స్నేహితులతో కలిసి మేకల్ని తోలుకొని అటవీ ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు కామాంధులు రెచ్చిపోయారు. వెంట పడి బాలికను లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: