అప్పుడెప్పుడో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘కుమారి 21ఎఫ్’ తో సంచలన విజయం దక్కించుకున్న యంగ్ హీరో రాజ్ త‌రుణ్. ఆ తర్వాత వచ్చిన ‘సినిమా చూపిస్త మావా’ కూడా మంచి హిట్ కొట్టింది. అయితే ఆ తర్వాత మాత్రం రాజ్ తరుణ్ కు అదృష్టం కలిసి రాలేదు. ఆ సినిమా చూపిస్త మావా చిత్రం తర్వాత వచ్చిన సినమాల్లో ఏదీ భారీ హిట్ కొట్టలేదు. తాజాగా ఓటీటీలో విడుదలైన ‘ఒరేయ్ బుజ్జిగా’ ఫర్వాలేదని అనిపించుకుంది. అదే దర్శకుడు కొండా విజ‌య్ కుమార్ - రాజ్ తరుణ్ కాంబినేష‌న్‌లో మరో మూవీ  తెర‌కెక్కుతోంది. ఈ లేటెస్ట్ మూవీకి  `పవర్ ప్లే` అని పేరు పెట్టారు. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1 గా ఈ చిత్రం రూపొందు తోంది. మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌,  మోష‌న్ పోస్ట‌ర్‌ని వెర్స‌టైల్ హీరో రానా ద‌గ్గుబాటి విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంద‌రికీ రానా విషెస్ చెప్పారు.

ఈ సందర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండా మాట్లాడుతూ  ``మా పవర్ ప్లే మూవీ ఫ‌స్ట్‌ లుక్, మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన రానాకు ధ‌న్య‌వాదాలు. పోస్ట‌ర్ లో రాజ్ త‌రుణ్ లుక్ ఎలా డిఫ‌రెంట్‌గా కనిపిస్తుందో.. సినిమా కూడా అలానే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. నేను, రాజ్ త‌రుణ్ ఇంత ‌వ‌ర‌కూ చేయ‌ని ఒక కొత్త జోన‌ర్‌లో భిన్నంగా ఉండేలా థ్రిల్ల‌ర్‌ ట్రై చేశాం. ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా`` అని చెప్పారు.  

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ.. ``విజ‌య్ కుమార్ గారితో `ఒరేయ్ బుజ్జిగా..`  లాంటి మంచి ఎంట‌ర్‌టైన‌ర్ చేశాను. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు ఒక స‌రికొత్త జోన‌ర్‌లో డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్ చేస్తున్నాను. నాకు ఇదొక కొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌. ఆడియ‌న్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది`` అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: