హోం లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మీకు సరైన సమయం. ఎందుకంటే ఈ లోన్ తీసుకోవాలని అనుకునే వారికి భారత్ లోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ శుభవార్త చెప్తోంది. అంటే మనం ఇప్పుడు సులభంగా సొంతింటి కలని నిజం చేసుకోవచ్చు అన్నమాట. మనం సొంతింటి కలను నెరవేర్చేందుకు స్టేట్ బ్యాంక్‌ తో మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ జత కట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… స్టేట్ బ్యాంక్‌, మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ భాగస్వామ్యం వల్ల కస్టమర్లకు ఇప్పుడు చాలా సులభంగా హోమ్ లోన్స్ లభిస్తాయని సమాచారం. ఈ క్రమంలోనే కస్టమర్లకు, ఉద్యోగులకు ప్రత్యేకంగా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తుందట. అంతే కాదండోయ్ ఈ హోం లోన్ కోసం ప్రత్యేక స్కీమ్స్‌ కూడా అందుబాటు లోకి తీసుకొస్తున్నట్లు ఈ బ్యాంకు ప్రకటించింది.

ఇలా స్టేట్ బ్యాంక్ తో మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ జత కట్టడం వల్ల గృహ రుణాలు సులభతరం అవుతాయని నిపుణులు భావిస్తున్నారు. దీనిపై మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అర్వింద్ సుబ్రమణియమ్ మాట్లాడారు. స్టేట్ బ్యాంకుతో తాము భాగస్వాములవడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఈ భాగస్వామ్యం వల్ల రెండు సంస్థల కస్టమర్లకు లాభం కలుగుతుందని, వారికి సులభంగా హోమ్ లోన్స్ వస్తాయని వెల్లడించారు.

ఈ భాగస్వామ్యం వల్ల హోమ్ లోన్ తీసుకోవాలని అనుకునే వారికి మరింత లాభం చేకూరనుందని సమాచారం. కాబట్టి వినియోగ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రెండు సంస్థలకు సంబంధించిన అధికారులు వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ ఇప్పటికే మహీంద్రా లైఫ్‌ స్పేస్ కంపెనీకి చెందిన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని, అయితే ఎం ఎం ఆర్, బెంగళూరు, పూణే, చెన్నై, నాగ్‌పూర్ వంటి ప్రాంతాల్లోనే ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు ఉన్నాయని స్టేట్ బ్యాంక్‌ రియల్ ఎస్టేట్ విభాగం హెడ్, చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: