గత ఎన్నికల దెబ్బకే ఇప్పటికే కోలుకోలేని పార్టీ టీడీపీ.. ఇప్పుడు ఎంత దయనీయ స్థితిలో ఉందో అందరికి తెలిసిందే. ఓటమితో ఇప్పటికే క్రుంగిపోయిన పార్టీ ఐ దెబ్బ మీద దెబ్బ అన్నట్లు లీడర్ లు కూడా ఇతర పార్టీ లకు వలసపోవడంతో మరింత డీలా పడిపోయింది. ఇలాంటి పరిస్థితి నుంచి నెగ్గుకొచ్చి వైసీపీ కి పోటీనిచ్చి గెలిచి అధికారంలోకి రావడం అంటే టీడీపీ కి ఎంతో కష్టమైనా పని.. అది టీడీపీ కి కూడా తెలుసు. కానీ పైకి మాత్రం వచ్చే ఎన్నికల్లో గెలిచి టీడీపీ అధికారంలోకి వస్తుందని మాయమాటలు చెప్తున్నారు. ఏ సీనియర్ నాయకుడిని కదిలించినా ఇదే మాట చెప్తూ జబర్దస్త్ జోకులు వేయడానికి ప్రయత్నిస్తున్నారు..
అంతేకాదు ఇప్పటినుంచే వారిలో వారు మంత్రిత్వ శాఖలను ప్రకటించేసుకుంటున్నారు. “మా పార్టీ అధికారంలోకి వస్తే.. ఆ ఇద్దరు మంత్రులు కావడం ఖాయం“ అని సదరు సీనియర్ తమ్ముళ్లు చెబుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి 2014లో విజయం సాధించిన బొండా ఉమామహేశ్వరరావు కు , పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, కు మంత్రి పదవి రావడం ఖాయం అంటున్నారు. 2019 ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయిన బోండా మళ్ళీ గెలవడం జరిగే పనేనా అని ఆ నియోజక వర్గం ప్రజలు అంటున్నారు.