ముందుగా మున్సిపల్ స్టేడియంలోని స్టాల్స్ ను పరిశీలించిన ఆయన.. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ చోటు చేసుకున్నా ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా సిఎం జగన్ పై గౌరవాన్ని మరింత పెంచింది. ఓ మూగజీవానికి దెబ్బ తగలకుండా తన చేతిని అడ్డుపెట్టి సీఎం జగన్ మరో సారి తన పెద్ద మనసును చాటుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. గోపూజ మహోత్సవంలో స్టాల్స్ ను పరిశీలిస్తూ ముందుకు వెలుతున్న జగన్ సంక్రాంతి గంగిరెద్దు రాకతో ఓ చోట నిలబడ్డారు. అప్పుడు ఆయనను ఆశీర్వదిస్తున్నట్లు ఎద్దు తలను అడిస్తుండగా ఆ క్షణంలో ఇనుప కంచెకు అటువైపు ఉన్న గంగిరెద్దు తల, ఫెన్సింగ్పై ఉన్న ఇనుప రాడ్కు తగిలేలా అనిపించడంతో వెంటనే అప్రమత్తమైన సీఎం జగన్.. ఆ ఇనుప రాడ్పై తన చేతిని అడ్డుగా ఉంచారు.దీంతో సీఎం జగన్ చేసిన పనికి చేతులెత్తి నమస్కరించారు ఆ గంగిరెద్దు యజమాని. దీంతో సీఎం జగన్ కు మూగజీవలపై ఉన్న ప్రేమను అందరూ కొనియాడుతున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.