అంతే కాకుండా భారత సరిహద్దుల్లో ఉన్న సైనికులకు అందరికీ ఎప్పటికప్పుడు అధునాతన టెక్నాలజీతో కూడిన అయిదాలను సమకూరుస్తూ భారత సైనికులు ని మరింత ప్రోత్సహిస్తుంది.. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత సైన్యం కూడా ఎంతో దూకుడుగా వ్యవహరిస్తోంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రస్తుతం చైనాతో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మేకిన్ ఇండియా లో భాగంగా భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో ఎంతో వేగంగా అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే త్వరలో సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికులు అందరికీ ఎంతో అధునాతన టెక్నాలజీతో కూడిన మిషన్ గన్స్ లాంటి రైఫీల్స్ అందించేందుకు డిఆర్డిఓ సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం భారత సైన్యం దగ్గర ఉన్నటువంటి 9 ఎంఎం రైఫిల్ స్థానంలో.. మిషన్ రైఫిల్ ఇవ్వడానికి డిఆర్డిఓ సిద్ధమవుతోంది. దీనిపై ఇప్పటికే పరిశోధనలు చేసిన డిఆర్డిఓ విజయవంతం అయింది. త్వరలో భారత సైన్యం చేతిలో కి ఈ మిషన్ రైఫిల్ రానున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత సైన్యం శత్రు దేశాలకు వణుకు పుట్టించడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు.