మీరు కారు కొనుకోవాలని అనుకుంటున్నారా.. అయితే మీకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కొత్తగా కారు కొనుగోలు చేస్తే ఏకంగా రూ.3 లక్షలకు పైగా తగ్గింపు అందుబాటులో ఉంది. ప్రముఖ దేశీ వాహన తయారీ కంపెనీ మహీంద్రా తన కార్లపై అదిరే ఆఫర్లు అందిస్తోంది. ఆల్‌న్యూ థార్‌ తప్ప మిగిలిన అన్ని వేరింయట్స్ పైనా ఈ ఆఫర్ వర్తిస్తోంది. వీటిలో క్యాష్‌ డిస్కౌంట్‌, ఎక్స్‌ఛేంజి బోనస్‌, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ ఇతర ఆఫర్లు కూడా వీటిలోనే కలిసి ఉంటాయి. జనవరి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

మహీంద్రా ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ ఆల్టురస్‌ జీ4 మోడల్‌పై అత్యధికంగా రూ.2.20లక్షల క్యాష్‌ డిస్కౌంట్‌, రూ.50 వేలు ఎక్స్‌ఛేంజి బోనస్‌, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ రూ.16వేలు, ఇతర లబ్ధిలు రూ.20 వేల వరకు లభిస్తాయి. స్కార్పియోపై రూ.39,502 వరకు డిస్కౌంట్లు ఇస్తోంది. వీటిల్లో రూ.10,002 క్యాష్‌ డిస్కౌంట్‌, రూ.15,000 ఎక్స్‌ఛేంజి ఆఫర్‌, రూ.4,500 కార్పొరేట్‌ డిస్కౌంట్‌, అదనపు ఆఫర్ల కింద మరో రూ.10వేలు ఇవ్వనున్నారు. కేయూవీ 100 నెక్స్ట్‌పై రూ.62,055 తగ్గింపు వర్తిస్తుంది. ఎక్స్‌యూవీ 500పై రూ.59వేల లబ్ధిపొందవచ్చు. ది మర్రాజో ఎంపీవీపై రూ.36వేలు, బొలేరోపై రూ.24వేల తగ్గింపులు వర్తిస్తాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కారుపై రూ.57,000 డిస్కౌంట్ ఉంది. మహీంద్రా స్కార్పియో కారుపై రూ.20 వేల క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.25,000 బెనిఫిట్ లభిస్తుంది. కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5,000 ఉంది. రూ.10 వేల విలువైన యాక్సిసిరీస్ పొందొచ్చు. అలాగే మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కారుపై కూడా తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ కారుపై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ పొందొచ్చు. రూ.25,000 ఎక్స్చేంజ్ బోనస్ సొంతం చేసుకోవచ్చు. అలాగే కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5,000 లభిస్తుంది. కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది అదిరిపోయే ఆఫర్ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: