ఈ క్రమంలోనే కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో కోట్ల సంఖ్యలో మాస్క్ వాడకం జరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఎంతో మంది వివిధ రకాల మాస్క్ లను వాడారు. అయితే ప్రస్తుతం మాస్క్ వల్ల కూడా మరో ముప్పు పొంచి ఉంది అన్నది అర్ధమవుతుంది. ఎందుకంటే.. ఇక కోట్ల సంఖ్యలో మాస్కుల వాడకం జరిగిన నేపథ్యంలో మాస్క్ వ్యర్థాలు పేరుకుపోవడం పై ప్రస్తుతం పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల వ్యర్థాలతో తీవ్ర స్థాయిలో పర్యావరణ కాలుష్యం జరుగి మానవాళికి ముప్పు వాటిల్లే పరిస్థితులు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇక ప్రజలకు అవగాహన కల్పిస్తూ పర్యావరణ కాలుష్యం జరగకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కానీ ప్రస్తుతం మాస్కు తప్పనిసరిగా మారిపోయిన నేపథ్యంలో రోజురోజుకు మాస్క్ వాడకం పెరిగిపోతున్నది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. దీంతో మాస్కు వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.. దీంతో పర్యావరణవేత్తలు ఆందోళన లో మునిగిపోతున్నారు. మాస్కు మట్టిలో కలవడానికి 50 ఏళ్లు పడుతుందని.. ఇక మాస్కు పై ఉండే పొర పాలీ ప్రొఫైలిన్ మట్టిలో కలవడానికి 20 నుంచి 30 సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు నిపుణులు. తద్వారా ఎంతగానో పర్యావరణ కాలుష్యం జరుగుతుంది అని అంటున్నారు.