ఎందరో పుడతారు కానీ.. మహానుభావులు కొందరేనని బాలకృష్ణ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప నటుడు ఎన్టీఆర్ అని పేర్కొన్న ఆయన ఎన్టీఆర్ అందగాడు.. గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి అని అన్నారు. తన పరిపాలనలో ఎన్టీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, హిందుపురం నియోజకవర్గంలో తాగు సాగు నీరుకు కారణం ఎన్టీఆర్ పథకాలేనని అన్నారు. తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు ఎన్టీఆర్ మానసపుత్రికలని ఆయన అన్నారు. నాకు నిరుత్సాహం కలిగినప్పుడు ఎన్టీఆర్ పేరు స్మరించుకుంటే ఆవేశం, ఉత్సాహం వస్తుందని ఆయన అన్నారు.
మరో పక్క ఎన్టీఆర్ ఘాట్ లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ , ఎల్. రమణ, రావుల, కంభంపాటి తదితరులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఎన్టీఆర్ ఘాట్ ను కూల్చాలన్న వ్యాఖ్యలపై స్పందించారు. ఎన్టీఆర్ ఘాట్ ను కూల్చటమంటే మన సంస్కృతిని మనం కూల్చుకోవటమే అని ఆయన అన్నారు. కూల్చటం వంటి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పేరు చెబితే శత్రువుల గుండెల్లో రైళ్ళు పరుగెడతాయన్న బాబు ఎన్టీఆర్ కు భారతరత్న ఆలస్యమైన మాట వాస్తవమె కానీ ఎన్టీఆర్ శత జయంతి రాబోతోంది. అప్పటిలోగా భారతరత్న సాధిస్తామని అన్నారు.