ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పులను విపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మంత్రుల అవినీతి వ్యవహారాలూ సహా పలు అంశాలను టార్గెట్ చేస్తున్నారు. ఇక మంత్రులు చేస్తున్న విమర్శల మీద కూడా కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. తాజాగా ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గనపై ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మానాన్న కేఈ మాదన్నను మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తండ్రి నాన్న అనేవారు అని ఆయన గుర్తు చేసారు. కానీ మంత్రి బుగ్గన మా నాన్న గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అన్నారు.

మంత్రి హోదాలో ఉన్న బుగ్గన పెద్దలను గౌరవించేలా నడుచుకోవాలి  అని ఆయన సూచించారు. వ్యంగ్యంగా మాట్లాడటానికి ఇది అసెంబ్లీ కాదు, డోన్ నియోజకవర్గం  అని అన్నారు. పెద్దలను గౌరవించకుండా వ్యంగ్యంగా, వెకిలి చేష్టలతో మాట్లాడితే డోన్ వైపు చూడకుండా ప్రజలు  వెంటబడి నిన్ను తరిమి కొడతారు అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు.   కేఈ మాదన్నపై కామెంట్లు చేసే స్థాయికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎదగలేదు అని సూచించారు. మా నాన్న దగ్గర కాళ్లు, వేళ్లు పట్టుకుని సర్పంచ్ ఓట్లు వేయించుకున్న సంఘటన మంత్రి బుగ్గన మర్చిపోవద్దు అని సూచించారు.

ఎన్నో ఏళ్లు సర్పంచిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి డోన్ కు ఏమి చేశారో చెప్పాలి అని డిమాండ్ చేసారు. కేఈ ప్రతాప్ కోట్ల రూపాయలతో డోన్ ను అభివృద్ది చేస్తారు అని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఏ చిన్న సంఘటన జరిగినా డోన్ కు నేనొస్తాను అని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా వెంట ఉంటే నా సత్తా ఏంటో చూపిస్తాను అన్నారు. గతంలో డోన్ నుంచి డిప్యూటేషన్ మీద పత్తికొండకు వెళ్లాను అని ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: