నవ మాసాలు మోసి కనిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలసిన భాధ్యత తల్లికి ఉంది. అలాంటి తల్లి సుఫారి ఇచ్చి మరీ తన బిడ్డను చంపించింది. ఈ అమానుష ఘటన ఇటీవలే చోటు చేసుకుంది. కూతురు పెడదారి పట్టడంతో ఆమెను సక్రమమైన మార్గంలోకి తెచ్చేందుకు తల్లి ప్రయత్నించింది. కానీ తల్లి మాటలు కూతురు వినిపించుకోలేదు. తనకు అడ్డు చెప్పొద్దు.. అక్రమ వ్యాపారాలు చేస్తూనే ఉంటానని కూతురు తెగేసి చెప్పింది. కూతురు పనులకు విసిగిపోయిన తల్లి ఆమెను చంపాలని అనుకుంది.. అందుకోసం కిరాయి ఇచ్చి మరీ చంపించింది..



అనుకున్న పథకం ప్రకారం రూ. 50 వేలు సుఫారీ ఇచ్చి చంపించింది. వివరాల్లోకి వెళితే .. ఈ ఘటన ఒడిశాలో వెలుగు చూసింది.బాలసోర్ జిల్లాకు చెందిన సుకురి గిరి అనే మహిలకు శిబానీ నాయక్‌ కూతురు ఉంది. నాయక్ కల్తీ మద్యం వ్యాపారం చేస్తోంది. కల్తీ మద్యంతో ప్రజల జీవితాలతో నాయక్ ఆడుకోవడం తల్లికి నచ్చలేదు. ఆ బిజినెస్ వదిలేయమని కూతురికి చెప్పింది అయిన ఆమె వినలేదు.. తప్పులు చేస్తూ తల్లిని ఎదురించి మాట్లాడటం తో తల్లి తల్లి తనాన్ని పక్కన పెట్టి ఇలాంటి వాటిని చేయొద్దని చెప్పింది.




తనకు ఏది చెప్పొద్దని తల్లికి వార్నింగ్ కూడా ఇచ్చింది. చేసేదేమీ లేక నాయక్‌ను మట్టుబెట్టాలని తల్లి నిర్ణయించుకుంది. దీంతో ప్రమోద్ జేనా తో పాటు మరో ఇద్దరితో నాయక్‌ను హత్య చేయాలని ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు రూ. 50 వేల సుపారీ ఇస్తానని చెప్పి, మొదట అడ్వాన్స్‌గా రూ. 8 వేలు ఇచ్చింది తల్లి సుకురి. ఇక జనవరి 12వ తేదీన శిబానీ నాయక్‌ను చంపేశారు. ఆ తర్వాత నాయక్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం జరిపిన పోలీసులు తల్లితో తో సహా మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తల్లి సుకురితో పాటు ప్రమోద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: