అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న పరిటాల కుటుంబం ఇప్పుడు కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తుంది అనే చెప్పాలి. అధికార పార్టీ నేతలను వరుసగా  పరిటాల కుటుంబం విమర్శిస్తూనే ఉంది. తాజాగా ఎన్టీఆర్ 25వ వర్ధంతి సభలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పరిటాల శ్రీరామ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మనం చేసిన అభివృద్ధికి వైసీపీ స్టిక్కర్లు వేసుకుంటోంది అని ఆయన మండిపడ్డారు. శిలాఫలకాలు పగులకొడితే టీడీపీ చేసిన అభివృద్ధిని దాచలేరు అని అన్నారు.

రాప్తాడులో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతోనే మట్టిరోడ్లు ఉండకుండా తారురోడ్లు వేశాం అని ఆయన తెలిపారు. ఇప్పుడేమో ఆ రోడ్లపై పర్సెంటేజీల పేరుతో  కాసులేరుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది అని ఆయన ఆరోపించారు. టమోటా మండీల్లోకూడా పెత్తనం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. టమోటా రైతులను బెదిరిస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. టోల్ పెట్టి వసూళ్లు చేస్తున్నారు అని మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలో భూములు అమ్మాలన్న కొనాలన్నా ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సి వస్తోందట అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.

దమ్ము గురించి మాట్లాడుతున్నావ్ అని... అబద్దాలు చెప్పే దమ్ము నాకులేదు అని ఆయన వ్యాఖ్యానించారు. మూడు రిజర్వాయర్లకు టెండర్లు పిలిచే దమ్ము ఎమ్మెల్యేకు లేదు అని అన్నారు. జాకీ పరిశ్రమ భూములు నీ కుటుంబ సభ్యులు చైర్మన్ గా వున్న సహకారసంఘానికి రాయించుకోవాలని చూస్తున్నావు అని మండిపడ్డారు. నీ అవినీతి అక్రమాలను వెలికి తీసి నీకు తగిన బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే వున్నాయ్ అని ఆయన వెల్లడించారు. జాకీ భూముల కోసమే సహకార సంఘాన్ని పెట్టావ్ అని ఆరోపించారు. మమ్మల్ని ఇంచార్జ్ ల పాలన అంటూ అబద్దాలు చెప్పి ప్రచారం చేశావ్ అని మండిపడ్డారు. ఇప్పుడేమో ఒక్కో అవినీతి వ్యవస్థకు  ఒక్కరిని నీకుటుంబసభ్యులను  ఇన్ చార్జ్ గా పెట్టి దోచుకుంటున్నావ్ అని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: